ఏపీలో మరో ఎన్నికలకు నోటిఫికేషన్... 21న పోలింగ్

by srinivas |
ఏపీలో మరో ఎన్నికలకు నోటిఫికేషన్... 21న పోలింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ శనివారం జారీ అయ్యింది. ఈ నెలాఖరున అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి నేతృత్వంలోని సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నెల 12 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. ఈ నెల 21న ఎన్నికలు జరుగనున్నాయి. వెంకట్రామిరెడ్డికి పోటీగా మరో ఇద్దరు ఉద్యోగులు బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అధికారులు అనేక ప్రయత్నాలు మెుదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఉద్యోగులను ఆకట్టుకునేందుకు పోటీదారులు రహస్యంగా క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed